
ఈ మ్యాచ్ లో భాగంగా నాలుగు సార్లు ఛాంపియన్ అయినా చెన్నై సూపర్ కింగ్స్ తో డిఫెండింగ్ ఛాంపియన్గా పేరు సంపాదించుకున్న గుజరాత్ టైటాన్స్ తలబడబోతుంది అని చెప్పాలి. చెన్నై వేదికగా మ్యాచ్ జరగడం ధోని సేనకు ఎంతో అనుకూలమైన అంశమె. అయితే ఈ జట్టు పై ఓటమి ఎరుగని గుజరాత్ కొండంత ఆత్మవిశ్వాసంతో బలులోకి దిగేందుకు సిద్ధమైంది. ఇలా రెండు సమవుజ్జిల మధ్య ఆసక్తికర సమరం అటు క్రికెట్ ప్రేక్షకులందరికీ అసలు సిసలైన మజాని పంచడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
ఈ క్రమంలోనే ఈ కీలకమైన పోరులో విజయం సాధించి ఇక ఫైనల్లో అడుగుపెట్టబోయే మొదటి టీం ఏది అనే విషయంపై కూడా ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు రివ్యూలు ఇచ్చేస్తున్నారు అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్ కు క్వాలిఫై అవుతుంది. అయితే ఇక ఈ మ్యాచ్ లో ఓడిపోయిన జట్టు ఇక మరో ప్రయత్నంగా రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడే అవకాశాన్ని దక్కించుకుంటుంది. ఇలా ఫైనల్ మ్యాచ్.. రెండో క్వాలిఫైయర్ మ్యాచ్.. రెండు కూడా నరేంద్ర మోడీ స్టేడియంలోనే జరగబోతున్నాయి అని చెప్పాలి. మరి నేటి మ్యాచ్ లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి మరి.