ఇక ఇప్పుడు మరో సారి కోహ్లీ మరో వివాదంలో చిక్కుకున్నాడు అన్నది తెలుస్తుంది. సౌతాఫ్రికా కెప్టెన్ టెంబ బావుమా విషయంలో విరాట్ కోహ్లీ వ్యవహరించిన తీరు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. టెంబ బావుమా నూ ఉద్దేశిస్తూ విరాట్ కోహ్లీ అసభ్యకర రీతిలో కామెంట్ చేయడం ప్రస్తుతం స్టేంప్స్ మైక్ లో రికార్డు కావడం గమనార్హం. సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో భాగంగా సౌత్ ఆఫ్రికా మొదట బ్యాటింగ్ చేసింది. ఇక ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో ఏడో ఓవర్ లో కె.ఎల్.రాహుల్ త్రో విసరడంతో టెంబ బావుమా రనౌట్ అయ్యాడు.
ఈ క్రమంలోనే ఇక నిరాశతో టెంబ బావుమా పెవిలియన్ వైపు వెళ్తున్న సమయంలో అతని ఉద్దేశించి విరాట్ కోహ్లీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. భాగ్ రహమద్ అంటూ బూతులు కూడా మాట్లాడాడు. అయితే కోహ్లి ఇలాంటి బూతులు మాట్లాడినప్పటికీ పక్కనే ఉన్న సహచర ఆటగాళ్లు మాత్రం ఏమీ పట్టనట్లుగా వ్యవహరించారు అన్నది తెలుస్తుంది. ఇక కోహ్లీ మాట్లాడిన ఈ ఘాటు వ్యాఖ్యలు కాస్త స్టేంప్స్ మైక్ లో రికార్డు అయ్యాయి.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే తొలి వన్డే సమయంలో టెంబ బావుమా, విరాట్ మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది అన్న విషయం తెలిసిందే.