కానీ అంచనాల మొత్తం తారుమారయ్యాయి. మొదటి రెండు మ్యాచ్ లలో టీమిండియా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. దీంతో ఇక మూడో మ్యాచ్లో కూడా ఓడిపోయి సిరీస్ సౌత్ ఆఫ్రికా కు అప్పగించడం ఖాయం అని అందరూ భావించారు. మరోసారి అంచనాలను తారుమారు చేస్తూ.. ఇక వరుసగా రెండో టీ20 మ్యాచ్ లో గెలిచింది టీమిండియా. ఇక ఇప్పుడు మూడో టి20 మ్యాచ్ చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ గా మారిపోయింది అని చెప్పాలి. కాగా 5వ టీ20 మ్యాచ్ బెంగళూరు వేదికగా జరగబోతుంది. ఇక ఈ మ్యాచ్ లో ఎవరు పైచేయి సాధించి విజయం సాధిస్తే వారికి సిరీస్ కైవసం అవుతుంది.
ఈ క్రమంలోనే నేడు జరగబోయే మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. వరుసగా రెండు మ్యాచ్ లలో గెలిచి కనబరిచిన టీమిండియా 5వ టి20 మ్యాచ్ లో కూడా గెలుస్తుందని అందరూ అనుకుంటున్నారు. అదే సమయంలో భారత జట్టును సొంత గడ్డపై దెబ్బకొట్టాలని సిరీస్ కైవసం చేసుకోవాలని అటు సౌత్ ఆఫ్రికా కూడా సిద్ధమైంది. ఇక ఈ రెండు జట్ల బలాబలాలు కూడా సమానంగా ఉన్న నేపథ్యంలో ఎవరు పైచేయి సాధిస్తారు అన్నది ఊహకందని విధంగానే ఉంది. ఫలితం తేలాలంటే మ్యాచ్ పూర్తయ్యేంత వరకు ఆగాల్సిందే మరి..