
ఇక ఆ తర్వాత రోహిత్ రెండో వన్డే మ్యాచ్ నుంచి అందుబాటులోకి రాగా.. రోహిత్ కెప్టెన్సీ వహించిన రెండు మ్యాచ్లలో కూడా టీమిండియా ఓడిపోవడం గమనార్హం. ఇదంతా పక్కన పెడితే ఇక రోహిత్ ఇలా కుటుంబ బాధ్యతలు నేపథ్యంలో జట్టుకు దూరంగా ఉండటం పై మాత్రం అటు సునీల్ గావాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. రోహిత్ టీమ్ ఇండియాకు సారథి.. అతను ప్రతి మ్యాచ్ కు అందుబాటులో ఉండాలి. అయితే కుటుంబ బాధ్యతలు వల్ల అతను అక్కడ ఉండాల్సి వచ్చిందని నాకు తెలుసు. అది నేను అర్థం చేసుకోగలను. కానీ ఒక్క మ్యాచ్ కోసం జట్టు కెప్టెన్గా వ్యవహరించే వారు ఎక్కడ ఉండరు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది ఏ ఇతర ఆటగాడికైనా జరగొచ్చు. నాయకత్వంలో కొనసాగింపు ఉండాలి అది జట్టుకు చాలా అవసరం కూడా.
అప్పుడే అందరూ నీతో ఉన్నారని భావన కూడా కలుగుతూ ఉంటుంది. ఇక అలాంటి సమయంలోనే జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే ఒక జట్టుకు ఇద్దరు నాయకులు ఉంటారు. జట్టు సభ్యులు ఇతరు నాయకుల కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది. ఇది జట్టుకు ఏ మాత్రం మంచిది కాదు. వన్ డే ప్రపంచ కప్ ప్రారంభమైతే మీరు కుటుంబ బాధ్యతలు నిర్వహించలేరు. అత్యవసర పరిస్థితుల మినహా మిగతా ఏ పనులున్నా టోర్నమెంట్ ముందే పూర్తి చేసుకోవాలి అంటూ సునీల్ గావాస్కర్ చెప్పుకొచ్చాడు.