ఎన్నో రోజుల నుంచి ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతూ వచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగింపు దశకు చేరుకుంది. నేడు జరగబోయే ఫైనల్ మ్యాచ్ తో ఇక ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్ కు తెరపడబోతోంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం అటు ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఐపీఎల్ ఫైనల్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్,  చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య పోరు జరగబోతుంది. గుజరాత్ లోనిఅహ్మదాబాద్ లో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ ఫైనల్ పోరు జరగబోతుంది అని చెప్పాలి.



 అయితే ఐపీఎల్ ప్రారంభ వేడుకలను ఎలా అయితే బిసిసిఐ ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించిందో.. ఇక ఇప్పుడు ముగింపు వేడుకలను కూడా ఇలాగే ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే ఎంతో మంది సెలబ్రిటీలో ముగింపు వేడుకలలో సందడి చేయబోతున్నారు అని చెప్పాలి. అయితే నేడు ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా తమదైన శైలిలో రివ్యూ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఐపీఎల్ లో జరిగిన ఒక ఆసక్తికర విషయం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.



 56 రోజుల పాటు ఎంతో ఉత్కంఠ భరితమైన క్రికెట్ను అందించిన ఐపీఎల్ లో.. జరిగిన ఆసక్తికర ఘటన గురించి తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లో తలబడిన రెండు జట్లు ఇక ఇప్పుడు ఫైనల్ లో కూడా ఐపీఎల్ లో చివరి మ్యాచ్ ఆడబోతున్నాయి అని చెప్పాలి. మార్చి 31వ తేదీన మోడీ స్టేడియంలో గుజరాత్, చెన్నై మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఇక ఇప్పుడు ఐపీఎల్ ఫైనల్ లో అదే గుజరాత్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య అదే అహ్మదాబాద్ లోని మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. మరి అప్పుడు ప్రారంభ మ్యాచ్ లో గుజరాత్ విజయం సాధించింది నేడు ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl