ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ ఎలా అయితే తర్వాత జనరేషన్ కి రోల్ మోడల్ లాగా నిలిచాడో.. ఇక ఇక ఇప్పుడు తర్వాత జనరేషన్ కి విరాట్ కోహ్లీ కూడా అలాగే రోల్ మోడల్ గా నిలుస్తాడు అని చెప్పాలి. ప్రస్తుతం విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులకు నేటితరంలో స్టార్ ప్లేయర్లుగా ఉన్నవారు ఎవరు కూడా కనీసం దరిదాపుల్లో కూడా లేరు. అయితే ప్రపంచ క్రికెట్లో ఎవరికి సాధ్యం కాని రికార్డులను సృష్టించిన సచిన్ రికార్డులను బద్దలు కొట్టడమే లక్ష్యంగా కోహ్లీ తన ఆట తీరును కొనసాగిస్తున్నాడు. అయితే ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో మాత్రం ఇలాంటి ఒక అరుదైన రికార్డును బద్దలు కొట్టే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు కోహ్లీ.
టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో విరాట్ కోహ్లీ ఒక్కడే ఒంటరి పోరాటం కొనసాగించాడు. ఆచితూచి ఆడుతూ టీమ్ ఇండియాను విజయ తీరాల వైపుకు నడిపించాడు. ఈ క్రమంలోనే 95 పరుగుల వద్ద ఉన్న విరాట్ కోహ్లీ ఎంతో అలవోకగా సెంచరీ సాధిస్తాడని వన్డే ఫార్మాట్లో సచిన్ సాధించిన 49 సెంచరీల రికార్డును బద్దలు కొడతాడు అందరూ అనుకున్నారు. కానీ చివర్లో సిక్స్ కొట్టే క్రమంలో చివరికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు విరాట్ కోహ్లీ. దీంతో ఇప్పటివరకు వన్డే ఫార్మట్ లో 48 సెంచరీలు చేసిన కోహ్లీ, సచిన్ 49 సెంచరీల రికార్డును మాత్రం బద్దలు కొట్టలేకపోయాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి