ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్లలో ఒకటైన వివో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సంస్ద తీసుకున్న నిర్ణయం చూస్తే షాక్ అవ్వక తప్పదు. అలాంటి సంచలన నిర్ణయం వివో తీసుకుంది. ఇంకా వివరాల్లోకి వెళ్తే.. చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ అయిన వివో మొబైల్ రిటైలర్స్కు మేలు చేయాలన్న ఉద్దేశంతో వచ్చే ఏడాది నుండి భారత్లో ఆన్లైన్ ఎక్స్క్లూజివ్ లాంచెస్కు ఫుల్స్టాప్ పెట్టాలని నిర్ణయించింది.
అదే సమయంలో అదే ధరకు మిగతా చానళ్ల ద్వారా తమ ఉత్పత్తులను లాంచ్ చేయనున్నట్టు వివో ఇండియా సీఈవో జెరోమ్ చెన్ తెలిపారు. అయితే వివో ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉంటాయని, ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ ఆఫర్లు ప్రకటిస్తాం అని తెలిపారు. వినియోగదారుల సంతృప్తే తమ ప్రధాన ధ్యేయమని ఇండియా సీఈఓ చెన్ పేర్కొన్నారు.
సంచలన నిర్ణయాన్ని ప్రకటించి వివోకు ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ కృతజ్ఞతలు కూడా తెలిపింది. కాగా ఈ సంవత్సరం వివో ఫోన్ నుండి ఎన్నో కొత్త రకాల స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చాయి. వినియోగదారులను ఎంతో ఆనందపరిచాయి ఈ స్మార్ట్ ఫోన్. కొన్ని కొన్ని ఫోన్లు మార్కెట్లో సంచలనం కూడా సృష్టించాయి.