ప్రేమ వ్యవహారాలను కొనసాగిస్తూ వస్తున్నా స్వాతిరెడ్డి తన భర్తను అతి కిరాతకంగా చంపిన సంఘటన ఈ మధ్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. పెళ్ళికి ముందే ప్రేమలో రాసక్రీడలు సాగిస్తూ వస్తున్నా ఆమె అడ్డుగా ఉన్నాడని భర్తను హతమార్చింది. మొగుడు దగ్గర దొరకలేని సుఖం ప్రియుడితో కావాలనుకొని అనుకుంది. దానికోసం అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలనుకుంది చివరకి పోలీసులకు అడ్డంగా దొరికింది.

 

వివరాల్లోకి వెళితే..గత కొంతకాలంగా పోలీసులకు చెమటలు పట్టించిన సుధాకర్ రెడ్డి హత్య కేసు ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చిందనే చెప్పాలి. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భర్త సుధాకర్‌రెడ్డి హత్యకేసులో నిందితురాలైన స్వాతిరెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కొంతకాలంగా కోర్టు కేసు వాయిదాలకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి ఇటీవల స్వాతిరెడ్డికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేశారు. 


కాగా, నాగర్‌ కర్నూల్‌ పట్టణానికి చెందిన స్వాతిరెడ్డి …కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి 2017 నవంబర్‌లో దారుణంగా హతమార్చింది. ఈ కేసులో ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేయగా కొంతకాలం జైలులో ఉంది. 2018 జూలైలో బెయిల్‌పై వచ్చిన స్వాతి మహబూబ్‌నగర్‌ స్టేట్‌ హోంకు తరలించారు. కేసు విచారణలో భాగంగా నాగర్‌కర్నూల్‌జిల్లా కోర్టులో వాయిదాలకు ఆమె హాజరు కాకపోవడంతో జిల్లా నాలుగో తరగతి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు న్యాయమూర్తి రవికుమార్‌ నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేశారు.

 

దీంతో స్టేట్‌ హోంలో ఉన్న ఆమెను అరెస్ట్‌ చేసి నిన్న కోర్టులో హాజరు పరిచారు. అనంతరం మహబూబ్‌నగర్‌ జిల్లా జైలుకు తరలించారు. ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టుకోలేదు అనుకున్న పాపకు పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. దీంతో ఇంకా జీవితాంతం జైలుకు గడపాల్సిందే.. మొత్తానికి పోలీసులు ఊపిరి పీల్చుకుంటున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: