ఇటీవల తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పై అలాగే మాజీ మంత్రి నారాయణ పై అమరావతి రాజధానిలో అక్రమ భూముల విషయమై ఏపీ సిఐడి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.అయితే భూముల విషయంలో టీడీపీ శ్రేణులు సంచలన వీడియోలు బయట పెట్టారు. అమరావతి ప్రాంతానికి చెందిన వాసులు చెప్పిన దాని ప్రకారం..అమరావతి భూముల విషయంలో తాము ఎలాంటి ఫిర్యాదు చేయలేదని వారు స్పష్టం చేశారు. తామ భూములు అమ్మిన మాట వాస్తవమేనని, అందులో ఎలాంటి బలవంతం ఎవరు చేయలేదని వారు చెప్పారు.

 భూముల విషయంలో ఎలాంటి కేసు పెట్టకపోయినప్పటికి తమతో సంతకాలు చేయించుకున్నారని వారు వాపోయారు. ఇందుకు సంబంధించిన విడియోలను టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఫెక్ సి‌ఎం దొంగ ఆధారాలు సృష్టించి కేసులు పెట్టారని లోకేష్ మండి పడ్డారు. నిజ‌మేంటో జ‌నానికి తెలిసేస‌రికి, జ‌గ‌న్‌రెడ్డి సృష్టించిన అబ‌ద్ధాలు ప్ర‌పంచం చుట్టి వస్తాయని, అస‌త్య‌ప్ర‌చారమే పెట్టుబ‌డిగా తెచ్చుకున్న‌ అధికారం అండ‌తో అమ‌రావ‌తిపై ప‌న్నిన కుట్ర‌ని తెలుగుదేశం బ‌ట్ట‌బ‌య‌లు చేసిందని ట్విట్టర్ లో లోకేష్ రాసుకొచ్చారు.

 ఫేక్ సీఎం ఆదేశాల‌తో, ఫేక్ ఎమ్మెల్యే ఆర్కే అసైన్డ్ రైతుల పేరుతో, సీఐడీకి ఫేక్ ఫిర్యాదు ఇచ్చార‌ని ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టాం అని లోకేష్ ద్వజమెత్తారు. ఇప్ప‌టికైనా ప్ర‌జారాజ‌ధాని అమ‌రావ‌తిపైనా, టిడిపిపైనా కుతంత్రాలు ఆపండి అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం లోకేష్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియో చూసిన నెటిజన్స్ సి‌ఎం జగన్ అధికారంతో కక్ష్య పూరిత రాజకీయాలు చేస్తున్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి వైసీపీ నేతలు ఈ విడియోలపై ఎలా స్పందిస్తారో చూడాలి.   
.

మరింత సమాచారం తెలుసుకోండి: