ప్రధాని పర్యటన ఏపీ బీజేపీలో ఊపు తెచ్చినట్టుంది. అందుకే వరుస కార్యక్రమాలకు ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టులో బైక్ ర్యాలీ నిర్వహించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమువీర్రాజు నిర్ణయించారు. భారతీయ జనతా పార్టీ యువమోర్చా మోర్చా ఆధ్వర్యంలో ఆగస్టు రెండో తేదీ నుంచి 15వరకు రాష్ట్ర వ్యాప్తంగా  యువ సంఘర్షణ యాత్ర చేపడతారట. విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. యువసంఘర్షణ యాత్ర గోడపత్రిక, లోగోను ఆవిష్కరించారు.


యువతకు ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చి మాట తప్పారని ఆయన అన్నారు. ఉపాధ్యాయులు, పోలీసు విభాగాల్లో జగన్ ఖాళీలు భర్తీ చేస్తాం‌మన్నారని.. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరిస్తామని చేసిన వాగ్ధానాలు ఏవీ నెరవేర్చలేదని వీర్రాజు విమర్శించారు. నాలుగు జోన్ లలో ఒకే సారి ఈ యాత్ర జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై సంఘర్షణకు తాము సిద్దం అవుతున్నామని సోము వీర్రాజు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

bjp