టీడీపీ సీనియర్‌ నేత, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కందిమళ్ల రఘునాథరావు(57) గురువారం ఉదయం గుండె పోటుతో మరణించారు. హైదరాబాద్‌ ఎర్రగడ్డలోని తన నివాసంలో గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ర‌ఘునాథ‌రావు నిజామాబాద్ జిల్లా బోధ‌న్‌కు చెందిన వారు. ఆయ‌న టీడీపీలో సుదీర్ఘ‌కాలంగా ప‌ని చేస్తూ వ‌స్తున్నారు. 

 

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో టీడీపీ ప‌రిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఈ టైంలో ఇక్క‌డ ర‌ఘునాథ‌రావు మృతి పార్టీకి తీర‌ని లోటే అని చెప్పాలి. స్వస్థలమైన బోధన్‌‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతదేహాన్ని అక్కడికి తరలించారు. రఘునాథరావు మృతికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: