తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం సుదీర్ఘ‌మైన కేబినెట్ మీటింగ్ త‌ర్వాత ఆదివారం రాత్రి విలేకర్ల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో తెలంగాణ‌లో తాజా కోవిడ్ కేసుల వివ‌రాలు. మ‌ర‌ణాల‌తో పాటు ప‌లు అంశాలు వివ‌రించారు. ఇక తెలంగాణ‌లో ఆదివారం కొత్త‌గా 18 కేసులు న‌మోదు అయ్యాయ‌ని.. వీటితో క‌లుపుకుంటే తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 858 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్టు కేసీఆర్ చెప్పారు.

 

ఇక 651 మంది ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్నారని కేసీఆర్ తెలిపారు. ఇక నాలుగు జిల్లాల్లో జీరో కేసులు న‌మోదు అయ్యాయ‌ని కేసీఆర్ తెలిపారు. వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లాతో పాటు యాదాద్రి భువ‌న‌గిరి, సిద్ధిపేట‌, వ‌న‌ప‌ర్తి జిల్లాల్లో ఒక్క కేసు కూడా న‌మోదు కాలేదని.. మొత్తం 33 జిల్లాల్లో 29 జిల్లాల్లో క‌రోనా కేసులు ఉన్నాయ‌ని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: