టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి ఇంట విషాదం చోటు చేసుకుంది. ఈ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉన్న కోహ్లీ పెంపుడు కుక్క బ్రునో బుధ‌వారం ఉద‌యం మృతి చెందింది. ఈ విష‌యాన్ని కోహ్లీ త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బ్రునో త‌మ కుటుంబంలో 11 ఏళ్లుగా ఒక మ‌నిషిగా క‌లిసి పోయింద‌ని.. ఈ రోజు బ్రునో లేక‌పోవ‌డం త‌మ‌కు ఎంతో బాధ‌గా ఉంద‌ని కోహ్లీ త‌న ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. నీతో 11 ఏళ్ల మా ప్ర‌యాణం ఓ తీపి గుర్తుగా మిగిలిపోతుంది. ఎప్పుడు నీ ప్రేమను మాపై కురిపించావు. నీ ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కూడా కోహ్లీ త‌న సందేశంలో పేర్కొన్నాడు. ఇక కోహ్లీ భార్య అనుష్క శ‌ర్మ సైతం ‘మిస్‌ యూ బ్రూనో.. రిప్‌’ అంటూ తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: