ఏపీలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 10 ఏళ్ల లోపు పిల్లలు, వృద్ధులు ఎక్కువగా కరోనా భారీన పడి మృతి చెందుతున్నారు. అయితే విశాఖ జిల్లాలో నాలుగు నెలల మగశిశువు కరోనాను జయించాడు. శ్వాస సమస్యలతో ఆస్పత్రిలో చేరిన నాలుగు నెలల శిశువుకు తాజాగా చేసిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ నిర్ధారణ అయింది. 
 
18 రోజుల పాటు విమ్స్ లో చికిత్స పొందిన బాలుడు నిన్న డిశ్చార్జి అయినట్లు కలెక్టర్ వినయ్ చంద్ వెల్లడించారు. బాలుడు త్వరగా కోలుకోవడానికి కారణమైన వైద్యులను ఆయన అభినందించారు. ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సుధాకర్ మాట్లాడుతూ బాలుడు కోలుకోవడం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. పిల్లలు కరోనాను జయించగలరని నాలుగు నెలల శిశువు నిరూపించాడని ఆయన పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: