దేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,922 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే దాదాపు 17వేల కేసులు నమోదు కావడం గమనార్హం. దేశంలో ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కొత్తగా నమోదైన కేసులతో కరోనా బాధితుల సంఖ్య 4,73,105కు చేరింది. 
 
ఈ కేసులలో 2,71,697 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా 1,86,514 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 418 మంది వైరస్ భారీన పడి మృతి చెందగా మృతుల సంఖ్య 14,894కు చేరింది.  రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టనుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: