మనదేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు శరవేగంగా చాపకింద నీరులా విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్ని పరీక్షలు చేస్తుంటే అన్ని కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ, కర్నాకట, తెలంగాణలో పరీక్షలు పెరుగుతోన్న కొద్ది కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉంటే కరోనా తీవ్రత నేపథ్యంలో పరీక్షల సంఖ్య కూడా పెంచుతున్నారు.
తాజాగా నిన్న దేశ వ్యాప్తంగా 2,10, 292 పరీక్షలు చేసినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంస్థ ప్రకటించింది. ఇక ఇప్పటి వరకు 86, 08, 654 పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 18 వేల 522 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 418 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసులు రెండు లక్షలు దాటాయి.
The total number of samples tested up to 29 june is 86,08,654 of which 2,10,292 samples were tested yesterday: indian Council of Medical Research (ICMR) pic.twitter.com/wEaE4lERVS
— ANI (@ANI) June 30, 2020