పాదయాత్ర సందర్భంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తన వద్దకు అనేక సమస్యలను తీసుకుని వచ్చారు అని సిఎం జగన్ అన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం కార్పోరేషన్ ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. పాదయాత్రలో అనేక సమస్యలను తాను విన్నా అని అన్నారు. అందుకే ఇప్పుడు ఏ దళారి వ్యవస్థ లేకుండా తాను ఈ కార్యక్రమం తీసుకొచ్చా అని సిఎం అన్నారు. 

 

ఇకపై సిఫారసులకు దళారులకు చోటు ఏ మాత్రం ఉండదు అని ఆయన స్పష్టం చేసారు. ఎవరూ కూడా జీతం అందడం లేదు అనే ఆవేదన వ్యక్తం చేయవద్దని సిఎం అన్నారు. 50 వేల 449 మందికి నియామక పత్రాలను అందిస్తున్నామని ఈ సంఖ్యను మరింతగా పెంచుతామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: