ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలి అంటూ ఆ ప్రాంత రైతులు పోరాటం మొదలు పెట్టి 200 రోజులు పూర్తి అయిన నేపధ్యంలో వారికి సంఘీభావం గా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా దీక్షలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఈ దీక్షలు కొనసాగుతున్నాయి. తాజాగా అమరావతి పార్టీ ఆఫీసులో వారి పోరాటానికి మద్దతుగా చంద్రబాబు నాయుడు దీక్షలో కూర్చున్నారు. 

 

ఆయనకు మద్దతుగా మాజీ మంత్రులు చిన రాజప్ప, రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, నక్క ఆనంద్ బాబు సహా పలువురు దీక్షలో కూర్చున్నారు. ఇక టీడీపీ నేతలు కొందరు రాజధాని గ్రామాలకు వెళ్తున్నారు. రాజధాని ప్రాంత రైతులు కూడా పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగిస్తున్నారు. పలువురు నేతలు సోషల్ మీడియాలో కూడా మద్దతు ప్రకటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: