తిరుపతి పార్లమెంటు పరిధిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో
వైసీపీ ఘన విజయం సాధించింది. త్వరలో తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుండడంతో ఇక్కడ మునిసిపల్ ఎన్నికల ఫలితాలు ఎలా ? వస్తాయా అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. అయితే ఇక్కడ
వైసీపీ తిరుగులేని విజయం సాధిస్తే జనసేన -
బీజేపీ పరువు పోయింది.. ఆ
పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు రాలేదు.
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లో యాభై డివిజన్లకు గాను 48 డివిజన్లలో
వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో పాటు
వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరు
పేట మున్సిపాలిటీలు కూడా
వైసీపీ పరమయ్యాయి.