ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటల 45 నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా సిద్దిపేట వెళ్ళనున్న ఆయన ఉదయం 11 గంటల 50 నిమిషాలకు సిద్దిపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవనం ప్రారంభోత్సవం చేయనున్నారు.. 

ఆ తర్వాత ఆయన సిద్దిపేట శివారులో ఉన్న పోలీస్ కమిషనరేట్ కార్యాలయం భవనానికి కూడా ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇక ఈ రెండు ప్రారంభోత్సవాలు అనంతరం సిద్దిపేట శివారులో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం భవనాన్ని కూడా ముఖ్యమంత్రి హోదాలో ఆయన ప్రారంభించనున్నారు.. ఇక ఆ తర్వాత ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి కేసీఆర్ సమావేశం కానున్నారు. చాలా రోజుల తర్వాత సిద్దిపేట జిల్లా పర్యటనకు కేసీఆర్ వస్తుండడంతో జిల్లాలోని నేతలు, కార్యకర్తలు అందరూ సీఎం పర్యటనకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: