తెలంగాణ‌లోని పెద్ద‌ప‌ల్లి జిల్లాలో దారుణ‌మైన ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది.  మంథ‌ని రెవెన్యూ డివిజ‌న్‌, కాసిపేట మండ‌లం ఉప్ప‌ట్ల గ్రామానికి చెందిన రేణుక (35) భ‌ర్త చేతిలో దారుణ హ‌త్య‌కు గురైన‌ది. గ‌త కొద్ది రోజులుగా భార్య భ‌ర్త‌లు ఇద్ద‌రి మ‌ధ్య త‌రుచూ చిన్న చిన్న గొడ‌వ‌లు చోటు చేసుకుంటుంటాయి. అయితే  ఈరోజు చిన్న చిన్న మ‌న‌స్పార్థాలు కాస్త పెద్ద గొడ‌వ‌కు దారి తీసాయి. ఆ గొడ‌వ కాస్త పెద్ద‌గా అయిన పెద్ద‌ల స‌మ‌క్షంలో కుటుంబ స‌భ్యుల‌పై పంచాయితీ కూడా పెట్టారు ఇవాళ‌.

పెద్ద‌ల మ‌ధ్య జ‌రిగిన పంచాయితీలో వీరిద్ద‌రికీ పెద్ద‌లు న‌చ్చ‌జెప్పేందుకు ప్ర‌య‌త్నం చేసి  రాజీ కుద‌ర్చాల‌ని చూసారు. కానీ రేణుక భ‌ర్త‌ అంత‌లోనే ఘోరానికి పాల్ప‌డ్డాడు. పెద్ద‌ల మ‌ధ్య జ‌రిగిన పంచాయితీలో తాను భ‌ర్త‌తో ఉండ‌ను అని వెళ్తున్న భార్య‌పై న‌డివీధిలో బండ‌రాయితో త‌ల‌పై కొట్టి చంపాడు భ‌ర్త‌. ఈ ప్రాంతంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. మంథని పోలీసులు ఈ ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ద‌ర్యాప్తు ను మొద‌లెట్టారు. క్ష‌ణిక ఆవేశంలో ఇలాంటి నిర్ణ‌యాలు ఎవ‌రూ కూడా  ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకొవ‌ద్దు అని పోలీసులు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: