శ్రీ గౌతమ్ సవాంగ్ గారిని ఆకస్మికంగా ఎందుకు మార్చారో ప్రజలకు చెప్పాలి..అంటూ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ డిమాండ్ చేశారు.ఈ మేర‌కు ఆయ‌న సామాజిక మాధ్య‌మాల్లో ఓ పోస్టు ఉంచారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌నేమన్నారంటే..ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా ఈ రోజు మధ్యాహ్నం వరకూ విధుల్లో ఉన్న శ్రీ గౌతమ్ సవాంగ్ గారిని ఆకస్మికంగా ఆ బాధ్యతల నుంచి పక్కకు తప్పించడం విస్మయం కలిగించింది.అధికారులను నియమించుకోవడం అనేది ప్రభుత్వానికి ఉన్న పాలనాపరమైన అధికారం కావచ్చు...కానీ వైసీపీ ప్రభుత్వానికి డీజీపీని హఠాత్తుగా మార్చాల్సిన అవసరం ఏమి వచ్చిందో? ఇందుకు దోహ‌ద‌ప‌డిన కారణాలను ప్రజలకు తెలియచెప్పాలి.లేని పక్షంలో - విజయవాడలో పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన ర్యాలీ విజయవంతం అయినందుకే శ్రీ సవాంగ్ గారిపై బదిలీ వేటు వేశారని భావించాల్సి వస్తుంది.ఉన్నతాధికారుల నుంచి చిన్నపాటి ఉద్యోగి వరకూ అందరినీ హెచ్చరించి.. భయపెట్టి..అదుపు చేసేందుకు శ్రీ సవాంగ్ గారి బదిలీని ఉదాహరణగా చూపించే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉంది.ఈ బదిలీ తీరు చూస్తే వైసీపీ ప్రభుత్వం చీఫ్ సెక్రెటరీగా ఉన్న శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం గారిని ఆకస్మికంగా పక్కకు తప్పించడమే గుర్తుకు వస్తుంది..అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: