ప్రజాగ్రహం తట్టుకోలేక  శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే.. మాల్దీవులకు పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అక్కడి నుంచి సింగపూర్ వెళ్లారు. ఈ మేరకు సింగపూర్ ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. కానీ.. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం సింగపూర్ వెళ్లలేకపోయారు. మాలే నుంచి సింగపూర్ ఎయిర్ లైన్స్ ద్వారా సింగపూర్ వెళ్లాలని శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స  భావించారు.

కానీ.. భద్రతా పరమైన కారణాలతో శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స  విమానం ఎక్కలేకపోయారు. ప్రైవేటు విమానంలో..సింగపూర్ వెళ్లేందుకు రాజపక్స చాలా ఎదురు చూశారు. అలా దేశం కాని దేశంలో ఎదురు చూపుల తర్వాత ఆయన సింగపూర్ చేరుకున్నారు. సింగపూర్‌ చేరిన తర్వాత ఆయన  శ్రీలంక అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. అంతకు ముందు  గొటబాయ రాజీనామాను డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున శ్రీలంక ప్రజలు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: