ఒక యూట్యూబ్‌ ఛానల్‌ ఒక మిలియన్ సబ్‌ స్క్రైబర్లను సంపాదించుకోవడం అంత సులభమైన విషయం కాదు. అందులోనూ సంచలనాలు, వినోదాలకు తావు లేని.. రైతుల సంక్షేమమే లక్ష్యంగా వ్యవసాయం ప్రధాన అంశంగా పెట్టిన యూట్యూబ్‌ ఛానల్‌ 10 లక్షల మంది సబ్‌ స్క్రైబర్లను సంపాదించుకోడవం నిస్సందేహంగా ఓ రికార్టు. రైతుబడి యూట్యూబ్ ఛానల్ అధినేత రాజేందర్ రెడ్డి అలాంటి రికార్డును సాధించారు. తెలుగులోనే అత్యధిక సబ్‌ స్క్రైబర్లు, వ్యూస్‌ సాధించి నెంబర్‌ వన్‌ అగ్రి మీడియాగా నిలిచింది తెలుగు రైతుబడి యూట్యూబ్‌ ఛానల్‌.

ఈ ఛానల్‌ వన్‌ మిలియన్‌ స్టోన్‌ వేడుక హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో వేడుకగా సాగింది. ఈ తెలుగు రైతుబడి యూట్యూబ్ ఛానల్ 1 మిలియన్ స్టోన్ మెగా ఈవెంట్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సమాచార శాఖ మాజీ కమీషనర్, సీనియర్ జర్నలిస్ట్ కట్టా శేఖర్ రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ రాజావరప్రసాద్ రావు తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: