ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ ఎన్నికల సర్వేలపై అందరి దృష్టి నెలకొంటుంది. తాజాగా స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సంస్థ కూడా ఏపీ రాజకీయాలపై సర్వే చేసి తమ ఫలితాలను వెల్లడించింది. ఈ సర్వే సంస్థ గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సర్వే చేసి కాంగ్రెస్ కు 65లోపు, బీఆర్ఎస్ కు 40లోపు సీట్లు వస్తాయని ప్రకటించింది. వచ్చిన ఫలితాలు కూడా కచ్చితంగా అలానే ఉన్నాయి. అందుకే ఈ సంస్థ సర్వే అంటే కాస్త నమ్మదగిందన్న టాక్‌ ఉంది.


అయితే ఏపీలో ఈ సారి ఏపీలో ఎన్డీయే కూటమికి 19-23 వరకు లోక్ సభ సీట్లు వస్తాయని.. స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సంస్థ చెబుతోంది. వైసీపీకి 2-3 స్థానాలు, ఇండియా కూటమికి సున్నా కే పరిమితం అవుతుందని స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ పేర్కొంది. ప్రస్తుతం ఈ సర్వేలు టీడీపీకి అనుకూలంగా ఉండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: