ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన ఎస్ బ్యాంక్ తాజాగా తన కస్టమర్ల కోసం భారీ ఆఫర్ ను ప్రకటించింది. అయితే అది కొందరికి మాత్రమే అందుబాటులో ఉండగా ఆ ఆఫర్ విషయానికి వస్తే బ్యాంకులో కొంతమంది కస్టమర్స్ కు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ని అందుబాటులోకి బ్యాంక్ తీసుకువచ్చింది. అయితే ఇది కేవలం ఎస్ బ్యాంకు లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన వారికే ఈ ఫెసిలిటీ లభిస్తోంది.


ఇకపోతే తమ బ్యాంకు లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వారు తమ బ్యాంకు నుండి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ పొందవచ్చని ఎస్ బ్యాంక్ యాజమాన్యం తెలిపింది. అయితే ఇందుకు గాను సాధారణ కస్టమర్లకు రెండు శాతం వడ్డీ పడనుండగా, సీనియర్ సిటిజన్స్ కోసం ఒక శాతం వడ్డీకే ఓవర్ డ్రాఫ్ట్ కింద లోన్ తీసుకోవచ్చని యాజమాన్యం తెలియజేసింది. ఇకపోతే ఈ రుణ సదుపాయం పొందాలంటే వారి బ్యాంకులో కనీసం రూ. 50000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఉండాలని తెలిపింది. అలాగే ఆ ఎఫ్ డి టెన్యూర్ కనీసం 181 రోజులు ఉంటే సరిపోతుందని తెలిపారు. అయితే అది కేవలం బ్యాంకుకు వెళ్లి కాకుండా బ్యాంకుకు వెళ్లకుండా కూడా ఈ సదుపాయాన్ని పొందవచ్చు అని ఎస్ బ్యాంకు యాజమాన్యం తెలిపింది. ఎస్ బ్యాంక్ మొబైల్, ఎస్ రోబో అప్లికేషన్ల ద్వారా ఈ సర్వీసులను పొందవచ్చని బ్యాంకు వివరించింది.


ఇకపోతే ప్రస్తుతం ఎస్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.75 శాతం వడ్డీ రేటును తన కస్టమర్లకు అందిస్తోంది. అయితే ఈ వడ్డీ రేటు కేవలం తొమ్మిది నెలల నుంచి ఏడాది కాలపరిమితిలో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ లకు మాత్రమే వర్తిస్తుంది. మొన్న జరిగిన ఎస్ బ్యాంక్ సంక్షోభం ద్వారా బ్యాంకులో డిపాజిట్లు తగ్గుతున్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి కారణం ఎస్ బ్యాంక్ యొక్క ఆర్థిక పరిస్థితులు, ఇతర అంశాలు దీనికి ప్రధాన కారణం.

మరింత సమాచారం తెలుసుకోండి: