దేశం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంటే.. ఇంకా కొంతమంది మాత్రం మూఢనమ్మకాలను పట్టుకుని వేలాడుతూ ఉన్నారు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయ్ అని నమ్ముతూ ఇంకా క్షుద్రపూజలు ఉన్నాయంటూ ఎంతోమంది దారుణాలకు పాల్పడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక మంత్రాల నెపంతో జరుగుతున్న దారుణ ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది మూడేళ్ల పసిప్రాయంలో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో కూడా ఆ చిన్నారికి అర్థం కాలేదు. చివరికి తల్లిదండ్రులు మూఢనమ్మకాలతో చేసిన పనికి ఆ చిన్నారి ప్రాణం పోయింది.



 ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి చివరికి అలసిపోయి కన్నుమూసింది ఆ మూడేళ్ల చిన్నారి. ఈ విషాదకర ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు వీరా రెడ్డి పల్లి లో వెలుగులోకి వచ్చింది. వేణుగోపాల్, యామిని దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఇటీవలే యామిని అనుమసముద్రంపేట మండలం లోని పుట్టింటికి వెళ్ళింది. అదేసమయంలో అత్తగారి ఇంటికి వెళ్లిన వేణుగోపాల్ తన ఇద్దరు కుమార్తెలు వెంటబెట్టుకుని సొంతూరు తీసుకువచ్చాడు. ఈ క్రమంలోనే వింత చేష్టలు చేశాడు. పిల్లలు ఇంటికి తీసుకు వచ్చిన తర్వాత కర్పూరం తో దిష్టి తీయించాడు . ఇక ముఖంపై పెద్ద బొట్టు పెట్టాడు. ఆ తర్వాత వింత పూజలు చేయడం మొదలు పెట్టాడు.



 ఈ క్రమంలోనే ఒక కూతురు పూర్విక ను గది బయటకు పంపించేశాడు. ఇక పునర్వికను గదిలోనే ఉంచి.. ఆమె నోట్లో కుంకుమ కొట్టాడు. అయితే అతని చేష్టలను  దగ్గరుండి చూస్తున్న తల్లి అతడిని ఆపేందుకు ప్రయత్నించ లేదు. ఒక రెండు గంటల పాటు ఈ తంతు కొనసాగింది అనే చెప్పాలి. తర్వాత పూర్వికను వెంటబెట్టుకొని దొరసానమ్మ వీధిలోకి వచ్చింది. స్థానికులు నిలదీయడంతో పూజి తంతు జరుగుతుంది అంటూ వివరించింది. దీంతో వెంటనే ఇంటి తలుపులు తీయించారు స్థానికులు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లి పోయింది చిన్నారి. ఇక బాలిక తల్లి యామిని వెంటనే పుట్టింటికి వచ్చింది. అయితే తమ కుమార్తెను ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది. భార్య  ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: