నేటి స‌మాజంలో ఆడవారికి రక్షణ గాల్లో దీపం మాదిరిగా మారింది. కొంద‌రు మగాళ్లు మృగాలుగా మారుతూ.. కామ‌వాంఛ తీర్చుకోవ‌మే ప‌నిగా పెట్టుకుంటున్నారు. మహిళలు, చిన్న పిల్లలపై జరగుతున్న అత్యాచారాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నా.. మరోవైపు మాత్రం అవేమి పట్టించుకోని కొంతమంది కామాంధులు తమపని తాము చేసుకుపోతున్నారు. ఇక నిర్భయ, దిశ చట్టాలు వచ్చినా కామాంధుల్లో కనీసం భయం కలగడం లేదు. వావీవరసలు మరచి కామాంధులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ఈ పేప‌రు తెర‌గేసినా..  ఇలాంటి వార్త‌లే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. చివ‌ర‌కు ఆడపిల్లను భయటకు పంపించాలంటేనే తల్లితండ్రులకు వణుకు పుడుతోంది. 

 

చివ‌ర‌కు తోబుట్టువులను సైతం కామంతో కాటేస్తున్నారు. తాజాగా ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు చెల్లెలిపైనే మూడేళ్లుగా అత్యాచారానికి పాల్ప‌డుతున్నారు. 
ఈ దారుణ ఘ‌ట‌న ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటుచేసుకుంది. ప్రియ అనే యువ‌తి నర్సింగ్ కోర్సు చదువుతోంది. అయితే ప్రియ‌పై మూడేళ్ల క్రితం వరుసకు సోదరులైన ఇద్దరు వ్యక్తులు క‌న్నేశారు. ఈ క్ర‌మంలోనే ఆమెపై స‌ద‌రు అన్న‌లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక ఈ విష‌యాన్ని బయట ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. బంధువులే దారుణానికి తెగబడటంతో.. ప్రియ విష‌యాన్ని బ‌య‌టపెట్ట‌లేక భ‌యంతో మౌనంగా ఉండిపోయింది. దీంతో ఆమె బాధ అర‌ణ్య‌రోధ‌న‌గా మారింది.

 

ఇక ఇంత‌లోనే ప్రియ తండ్రి కూడా కొన్నాళ్ల కిందట చనిపోయాడు. దీంతో ఆమె మ‌రింత‌ నిస్సహాయురాలైపోయింది. అయితే ఈమె నిస్స‌హాయ‌త ఆస‌రాగా తీసుకున్న స‌ద‌రు అన్న‌ద‌మ్ములు ప్రియ‌పై అనేక సార్లు అత్యాచారం చేసే వారు. ఈ విషయం బయటపెడితే ప్రియ‌తో పాటు ఆమె తల్లిని కూడా చంపేస్తామని స‌దరు అన్న‌ద‌మ్ములు బెదిరించారు. దీంతో బాధితురాలు బయటికి చెప్పుకోలేకపోయింది. కానీ, ప‌దే ప‌దే వేధిస్తుంటే.. స‌హించ‌లేని ప్రియ త‌ల్లి సూచ‌న‌తో తెలివిగా వీడియో తీసి ఎస్పీ కార్యాలయానికి వెళ్లి అందించింది. ప‌క్కా ఆధారాల‌తో బాధితురాలు ఫిర్యాదు చేయ‌డంతో.. వెంట‌నే కేసు న‌మోదు చేసిన పోలీసులు ఆ నీచ‌పు అన్న‌ద‌మ్ముల‌ను అరెస్ట్ చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: