మహిళపై దాడులను నివారించడానికి ప్రభుత్వాలు ఎన్నో రకాల చర్యల ను , కొత్త చట్టాలను తీసుకొస్తున్నారు. ఎక్కడైనా మహిళల పై దాడి చేస్తే పోలీసులు నిందితులను పట్టుకొని వారిని కఠినంగా శిక్షిస్తున్నారు. అయినా కానీ ఆ కామ మృగాళ్లు ఎటువంటి మార్పులు రాలేదు.. ఏదోక విధంగా నేరాలు జరుగుతూ నే ఉన్నాయి.ఇప్పుడు కూడా మరో ఘటన వెలుగు లోకి వచ్చింది. పెళ్లికి యువతి నో చెప్పిందని అతి దారుణం గా కాల్చి చంపారు.. ఈ ఘటన ఇస్లామాబాద్, లాహోర్‌లో వెలుగు చూసింది..


మయారా జుల్ఫీకర్ మిడిల్సెక్స్ వర్సిటీ నుంచి న్యాయ శాస్త్రం లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మయారా ఓ పెళ్లికి హాజరయ్యేందుకు పాకిస్థాన్ వచ్చారని, కొంత కాలం అక్కడే ఉండాలని భావించినట్లు తెలుస్తోంది. లాహోర్‌ లో ఉన్న మయారా బంధువు మొహమ్మద్ నజీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య కు గురవ్వడాని కి ఒక రోజు ముందు మయారా తన ఇంటికి వచ్చినట్లు తెలిపారు. అసద్ అమీర్ బట్, జాబిద్ జాదున్ అనే ఇద్దరు వ్యక్తులు పెళ్లి గురించి తనను బలవంతం చేస్తున్నారని.. పెళ్లికి నిరాకరించడంతో వారు బెదిరించినట్లు మయారా చెప్పిందని నజీర్ వివరించారు.


కట్ చేస్తే.. ఆమె శవమైంది.. ఆమె శరీరంలో రెండు బుల్లెట్ లు ఉన్నట్లు తెలుస్తోంది.. ఒకటి ఆమె మెడపై, మరోకటి ఆమె చేతి వద్ద ఉన్నాయి. కుడి చెయ్యి, ఎడమ పాదంపై గాయాలు కనిపించాయి. ఈ కేసు లో పోలీసులు నిందితులు ఇంకా అరెస్టు చేయలేదు. ఇస్లామాబాద్, లాహోర్‌ లో పోలీసు బృందాలు నిందితుల కేసులు దర్యాప్తు చేస్తున్నాయి. పోరెన్సిక్ బృందం మయారా ఇంటిని సందర్శించి సంఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ విషయం పోలీసులకు మాత్రం ఒక క్లారిటీ రాలేదు..ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: