కర్ణాటకలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకున్న వాడికి ఆడా మగా తేడా లేకుండా పోయిందన్న చందంగా సమాజం మారిపోయింది. ఇప్పటికే చిన్నారులపై వృద్ధుల పై పశువుల పై అత్యాచారాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తూ ఉంటే తాజాగా కర్ణాటక లో జరిగిన ఘటన చూస్తుంటే దుర్మార్గులు మరింత దిగజారి పోయారు అన్న విధంగా కనిపిస్తోంది. తాజాగా కర్ణాటకలో ఓ యువకుడిపై కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దక్షిణ కర్ణాటక లోని కబక అనే గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అదే గ్రామంలో నివసిస్తున్న ఓ 20 ఏళ్ల యువకుడు సాయంత్రం పూట వాకింగ్ కు వెళ్ళాడు. యువకుడు వాకింగ్ కు వెళ్ళగా అదే గ్రామ శివారులో హనీఫ్ అనే వ్యక్తి కలిశాడు.

హనీఫ్ కు యువకుడి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తెలిసిన వ్యక్తి కావడంతో యువకుడు హనీఫ్ ను పలకరించాడు. దాంతో హనీఫ్ కాసేపు ముచ్చటించి వాకింగ్ చేసి అలసిపోయినట్లు ఉన్నావు చెరుకు రసం తాగిస్తా రా అంటూ తీసుకువెళ్ళాడు. చెరుకు రసం తాగిన అనంతరం యువకుడిని హనీఫ్ పొదల్లోకి తీసుకువెళ్లి సెక్స్ చేయాలని బలవంతం చేసినట్టు తెలుస్తోంది. దాంతో యువకుడు భయాందోళనకు గురై షాక్ అయ్యాడు .

అక్కడ నుండి పారిపోవడానికి యువకుడు ప్రయత్నించాడు. కానీ చంపేస్తానని బెదిరించి అతడిపై  హనీఫ్ బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ ఘటన జరిగిన తర్వాత యువకుడు ఇంటికి వెళ్లగా అతడు వణకడం చూసి తండ్రి ఏం జరిగింది అని ప్రశ్నించాడు. దాంతో యువకుడు జరిగిన విషయం అంతా తన తండ్రికి చెప్పేశాడు. అనంతరం హనీఫ్ పై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపించారు .

మరింత సమాచారం తెలుసుకోండి: