ఒంటరిగా సాగిపోతున్న జీవితానికి ఒక తోడు నీడ కావాలని ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకుంటారు. మనసును అర్థం చేసుకున్న మనిషి భాగస్వామిగా వస్తే అంతకన్నా అదృష్టం ఏం ఉంటుంది అని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వేదమంత్రాల సాక్షిగా ఈ ఏడడుగులు నడిచి మూడు ముళ్ళతో ఒక్కటవుతారు జంటలు. ఇక ఆ తర్వాత దాంపత్య జీవితంలో ఎంతో హాయిగా జీవిస్తూ ఉంటారు. అయితే ఇదంతా నేటి రోజుల్లో కేవలం మాటలకు మాత్రమే పరిమితం అవుతుంది అని చెప్పాలి  ఎందుకంటే నేటి రోజుల్లో భార్య భర్తల బంధం అనేది అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్గా కాదు ఏకంగా ప్రాణాలు పోవడానికి చిరునామాగా మారిపోతుంది.


 భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవలు పెద్దది గా భావిస్తూ ఎంతోమంది మనస్థాపం చెంది చివరికి ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. మరి కొంతమంది మూడుముళ్ల బంధంతో ఒక్కటై కడవరకు తోడు ఉంటామని ప్రమాణం చేసిన వారే కట్టుకున్న వారి పాలిట కాలయముడుగా మారిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే సభ్య సమాజం ఎటుపోతోందో కూడా అర్థం కాని విధంగా మారిపోతుంది పరిస్థితి. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. భార్య తన పై పోలీసులకు ఫిర్యాదు చేసింది అన్న కారణంతో భర్త మనస్థాపం చెంది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.


 పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాల రాజు అనే వ్యక్తి కి ఏలూరు శివారులోని చోదిమెళ్ళ లో ఉంటున్న జ్యోతి అనే యువతితో కొంతకాలం కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంది ఈ కుటుంబం. అయితే ఇటీవలే అత్త ఇంట్లో బంధువు  చనిపోవడంతో రెండు వారాల కిందట అక్కడికి వెళ్లారు  భార్య భర్తలు. ఇక ఇంతలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో జ్యోతి చీమల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆ తరువాత ఆసుపత్రికి తరలించగా చికిత్స తీసుకుని కోలుకున్న భార్య తన భర్త వేధింపులు పాల్పడుతున్నాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు భర్తను పోలీస్ స్టేషన్ కు రావాలి అంటూ పిలవడంతో మనస్థాపం చెందిన భర్త బాలరాజు చివరికి రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: