కానీ ఒక యువకుడిపై ఏకంగా యువతి యాసిడ్ దాడికి పాల్పడటం అనేది ఇప్పటివరకూ కనీవినీ ఎరుగనిది అని చెప్పాలి. కానీ ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. పెళ్లికి నిరాకరించిన వ్యక్తిపై ఓ వివాహిత యాసిడ్ దాడి చేయడం సంచలనం గా మారిపోయింది. ఈ ఘటన కేరళలో వెలుగులోకి వచ్చింది. తిరువనంతపురానికి చెందిన అరుణ్ కుమార్ అనే వ్యక్తికి షీబా అనే మహిళతో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. అయితే అప్పటికే ఆ మహిళలకు వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్తతో విడిపోయి ఆ మహిళ ప్రస్తుతం ఒంటరిగా ఉంటుంది. ఈ విషయాలు తెలియని అరుణ్ మహిళతో ప్రేమాయణానికి తెరలేపాడు.
ఇక ఓ రోజు షీబా కు వివాహం జరిగి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అన్న విషయం వరుణ్ కి తెలిసింది. దీంతో ఇక వారి ప్రేమ బంధానికి స్వస్తి పలకాలని భావించాడు. కానీ సదరు మహిళ మాత్రం తనను వివాహం చేసుకోవలసిందే అంటూ పట్టుబట్టింది. అందరికీ తమ బంధం గురించి చెప్పి నవ్వులపాలు చేస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడింది. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు కూడా వసూలు చేసింది. ఈ క్రమంలోనే ఇటీవల తన అన్న స్నేహితుడితో కలిసి చర్చికి వెళ్లి అరుణ్ ఆమెకు కొంత డబ్బు ఇచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పెళ్లి విషయంలో గొడవ జరిగింది. వివాహం చేసుకునే ప్రసక్తేలేదు అంటూ అరుణ్ షీబా తో చెప్పడంతో ఆగ్రహించిన ఆ మహిళ తనతో పాటు తెచ్చుకున్న యాసిడ్ తో అతడిపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యింది. అయితే ఈ యాసిడ్ దాడిలో అరుణ్ కుమార్ కంటి చూపు పోయినట్లు తెలుస్తోంది.. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.