ఇటీవలే హైదరాబాద్లో మైనర్ బాలిక మిస్సింగ్ కేస్ కాస్త సంచలనంగా  మారిపోయింది. అకస్మాత్తుగా మైనర్ బాలిక కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు ఎంత కంగారు పడిపోయారు. ఈ క్రమంలోనే ఇక వెంటనే పోలీసులను ఆశ్రయించారు తల్లిదండ్రులు. తమ కూతురు కనిపించడం లేదు అంటూ ఫిర్యాదు చేశారు.. అయితే ఈ కేసును ఎంతో సవాలుగా తీసుకున్న పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి ఇక బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు  చివరికి బాలిక ఆచూకీ కనుగొన్నారు. కానీ ఆ తర్వాత బాలిక చెప్పిన మాటలతో తల్లిదండ్రులతోపాటు పోలీసులు సైతం ఒక్కసారిగా షాకయ్యారు.


 తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని తానే ఇష్టపూర్వకంగా తన బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్తాను అంటూ మైనర్ బాలిక వెళ్లాను అంటూ చెప్పడంతో అందరూ షాక్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఒక బాలిక ఇటీవలే కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు ఎంతగానో కంగారు పడిపోయి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే మైనర్ బాలిక కోసం  బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి మైనర్ బాలిక ట్రేస్ అవుట్ అయింది. ఇక మైనర్ బాలికను అదుపులోకి తీసుకొని విచారణ జరిపించగా.. ఇష్టపూర్వకంగానే తన బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్లాను అని ఒప్పుకుంది బాలిక.


 అయితే యువతి డిప్రెషన్ లో ఉందని ఇక ఈ డిప్రెషన్ తోనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదులో తెలపడం గమనార్హం.. అయితే పోలీసులు మాత్రం ఇక బాలిక ప్రవర్తనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాలిక ఏదో విషయాన్ని దాచిపెడుతుంది అని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కేసు గురించి మరింత లోతుగా విచారణ చేయాలని పోలీసులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: