మహిళల పై లైంగిక దాడులు జరగడం మనం వినే ఉంటాము.. రోజుకు ఎంతో మంది భాధింపబడుతున్నారు. ఫర్ ఎ చేంజ్.. బాలుడు పై యువతి లైంగిక దాడి, బలవంతంగా రేప్ చేసిందనే ఘటన ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది.వామ్మో అదెలా సాధ్యం అనే డౌట్ చాలా మందికి వచ్చి ఉంటుంది కదూ..అవును మీరు విన్నది అక్షరాల నిజం..ఓ 20 ఏళ్ళ యువతి 17 ఏళ్ల కుర్రాడి పై లైంగిక దాడి చేసింది.అలా తనకూ కావలసినప్పుడు పిలిచి లైంగిక దాడి చేసేది.ఆమె ఆగడాలు ఎక్కువ కావడంతో  పోలీసులను ఆశ్రయించింది..


వివరాల్లొకి వెళితే..ముంబాయిలోని ధారావి ప్రాంతానికి చెందిన ఓ యువతికి ఓ బాలుడి తో సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యాడు. 2020 సంవత్సరంలో వీరి మధ్య సోషల్ మీడియాలో స్నేహం చిగురించింది. వీరు ఇద్దరూ తరచూ చాటింగ్ చేసుకుననేవారు. ఇదంతా ప్రేమగా భావించిన యువతి ఆ బాలుడికి ప్రపోజ్ చేసింది. కానీ ఆమె ప్రపోజల్ ను ఆ మైనర్ రిజెక్ట్ చేశాడు. దీంతో పాటు ఆమె నుంచి కాల్స్ రాకుండా ఫోన్ నెంబర్ ను బ్లాక్ చేశాడు. అలాగే సోషల్ మీడియా అకౌంట్లను కూడా బ్లాక్ లో పెట్టాడు.. అయిన ఆమె విడిచి పెట్టలేదు..



వేరే వేరే అకౌంట్స్ ద్వారా అతనికి మెసేజ్ చేసి విసిగించేది.జాబ్ ప్రయత్నాలు కొనసాగించాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి తనను కలవాలని కోరింది. ధారవిలో ఉన్న తన ఇంటికి రావాలని అడిగింది. ఆమె మాటలు నమ్మి ఆ మైనర్ ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆ యువతి బాలుడిపై లైంగిక దాడి చేసింది.అలా చాలా సార్లు ఆమె అతని పై దాడి చేసింది. ఆమె టాచర్ ను భరించలేని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఆ యువతి బాలుడి కుటుంబంపై కేసు పెట్టింది. మైనర్, అతడి తండ్రి తో పాటు నలుగురు మేనమామలు, ఓ బంధువు కలిసి తనను రేప్ చేశారని ఆరోపించింది..ఇప్పుడు ఈ ఘటన సంచలనంగా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: