ఇండియా, పాకిస్థాన్‌ ఒకేసారి స్వాతంత్ర్యం పొందినా రెండు దేశాల ప్రయాణం మాత్రం విభిన్నంగా సాగింది. ఇండియాలో పరిపూర్ణ ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంటే.. పాక్‌లో మాత్రం సైన్యం చేతిలోని కీలుబొమ్మ ప్రభుత్వాలు అధికారంలో కొనసాగుతున్నాయి. ప్రత్యేకించి భారత విదేశాంగ విధానం దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా ధృఢంగా ఉంది. ఈ విషయంలో పాక్ నేత ఇమ్రాన్ ఖాన్‌ ఇండియాను మెచ్చుకుంటారు. తాజాగా ఆయన మాజీ ప్రధాని అయ్యాక కూడా ఇండియా విదేశాంగ విధానాన్ని మెచ్చుకున్నారు.  


ఇండియా పెట్రోల్‌, డీజిల్‌పై సుంకాన్ని తగ్గించడంపై పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌  ఆయన స్పందించారు. అమెరికా ఒత్తిడిని సైతం సమర్థంగా ఎదుర్కొని భారత్‌ రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేసిందని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌  గుర్తు చేశారు. ఇండియా క్వాడ్‌ కూటమిలో ఉన్నప్పటికీ తమ ప్రజలకు ఉపశమనం కల్పించడం కోసమే అలా చేసిందని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌  అన్నారు. భారత్ దేశానికి స్వతంత్రమైన విదేశాంగ విధానం ఉండడం వల్లే ఇది సాధ్యమైందని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ అన్నారు.


భారత్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపునకు సంబంధించిన కథనాన్ని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌  తన పోస్టుకు జత చేశారు కూడా. తాను అధికారంలో ఉన్నప్పుడు కూడా పాక్‌ కోసం ప్రత్యేక విదేశాంగ విధానం తెచ్చేందుకు కృషి చేశానని చెప్పుకున్నారు. కానీ కొందరు పాక్ నేతలు విదేశీ శక్తులకు తలొగ్గి అధికార మార్పిడికి కారణమయ్యారని విమర్శించారు.


ఈ విమర్శలు పరోక్షంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఆ నేతలు అలా చేయడం వల్లే పాక్ ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. సదరు నేతలు  తలాతోక లేని ప్రభుత్వాన్ని నడుపుతున్నారని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: