హైదరాబాద్ నడి బొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారకం త్వరలో అందుబాటులోకి రాబోతోంది. వచ్చే నెల ఒకటో తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా స్మారకం ప్రారంభోత్సవం కానుంది. ఈ ప్రాంగణానికి ఎవరు వచ్చినా అమర వీరుల త్యాగాలు గుర్తు చేసుకునేలా ఏర్పాట్లు ఉండబోతున్నాయి.


ఈ నిర్మాణ పనులను మంత్రి ప్రశాంత్‌ రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిని తెలుసుకున్నారు. నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరుగుతూ పనులను క్షేత్ర స్థాయిలో మంత్రి ప్రశాంత్‌ రెడ్డి పరిశీలించారు. ప్రధాన ద్వారం, ల్యాండ్ స్కేప్, పార్కింగ్ ప్రాంతాలు, తెలంగాణ తల్లి విగ్రహం, ఫౌంటైన్, గ్రానైట్ ఫ్లోరింగ్, ఫోటో గ్యాలరీ, ఆడియో- విజువల్ రూం, లిఫ్ట్ లు, ఎస్కలేటర్, కన్వెన్షన్ సెంటర్, పై అంతస్తులో రెస్టారెంట్, నిరంతరం జ్వలించేలా ఉండే జ్యోతి ఆకృతి వంటి అన్ని రకాల పనులను మంత్రి ప్రశాంత్‌ రెడ్డి పరిశీలించారు.


సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణాన్ని చేపట్టారని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి అన్నారు.  అరుదైన స్టెయిన్ స్టీల్ తో అన్ని రకాల అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సకల హంగులతో నిర్మించినట్లు మంత్రి ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. స్టెయిన్ లెస్ స్టీల్ తో నిర్మించిన అరుదైన అతిపెద్ద కట్టడం ప్రపంచంలో ఇదేనని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇది యావత్ తెలంగాణ ప్రజల హృదయాలను హత్తుకునే కట్టడమని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు.


ఈ కార్యక్రమం కోసం ప్రతి ఒక్కరూ మనసుపెట్టి పనిచేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను మంత్రి ప్రశాంత్‌ రెడ్డి కోరారు. ల్యాండ్ స్కేప్ ఏరియాలో పచ్చదనానికి ప్రాముఖ్యత ఇవ్వాలని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి సూచించారు. ఆహ్లాదకరమైన రంగురంగుల పూల మొక్కలు ఏర్పాటు చేయాలని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి సూచించారు. ఫినిషింగ్ పనుల్లో వేగం పెంచాలని.. గడువులోగా పనులు పూర్తయ్యేలా సిబ్బందిని పెంచాలని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: