తొలి మూడు సీజన్ లతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఉర్రూతలూగించిన రియాలిటీ షో 'బిగ్ బాస్' నాలుగవ సీజన్ కు ముస్తాబవుతోంది. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ రియాల్టీ షో పై ప్రేక్షకులు చాలా అంచనాలను పెట్టుకున్నారు. మొదటి సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా అదరగొట్టేయగా రెండో సీజన్ లో న్యాచురల్ స్టార్ నాని మంచి మార్కులు కొట్టేశాడు. ఇక మూడవ సీజన్ హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున దీన్ని విజయవంతం చేశారు. ఇకపోతే ఇప్పుడు బిగ్ బాస్ సీజ‌న్ 4 సంగ‌తేమిటి.?  హోస్ట్ ఎవ‌రు.?  పార్టిసిపెంట్స్ ఎవ‌రెవ‌రు..? లాంటి కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి.

 

కరోనా నేపథ్యంలో ఈసారి భారీ మార్పులు చేసినట్టు తెలుస్తోంది. గత సీజన్‌ లలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో కలుపుకుని 18 మంది కంటెస్టెంట్ల ఉండగా.. ఈ సీజన్‌ కి కేవలం 12-15 మంది కంటెస్టెంట్లు మాత్రమే ఉంటారని.. షో కూడా 50 రోజులకు కుదించినట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే ఇప్పటికే బయటకు వచ్చిన సమాచారం ప్రకారం అక్కినేని కోడలు సమంత నాలుగో సీజన్ హోస్ట్ గా వ్యవహరించబోతోందట. నిర్వాహకులు ఈమెని హోస్ట్ గా తీసుకోవాలని విపరీతంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇకపోతే ఈసారి ఇంట్లో ఐదారుగురు అంద‌గ‌త్తెల ట్రీట్ ఉంటుంద‌ని తెలిసింది.

 

వీళ్ల‌లో శ్ర‌ద్ధా దాస్, హంసా నందిని, యామిని భాస్క‌ర్, మోనా, ప్రియా వ‌డ్ల మాని పేర్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి వీళ్లంతా బిగ్ బాస్ హౌస్ లో అగ్గి రాజేసేందుకు బ‌రిలో దిగుతున్నార‌న్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఇప్పటికే హీరో తరుణ్, యాంకర్ వర్షిని, సింగర్ మంగ్లీ, అఖిల్ సర్తార్, యాంకర్ మరియు కమెడియన్ బిత్తిరి సత్తి పేర్లు ఖరారు అయినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: