
అయితే దానికి భారత్ సరే నీ పని నువ్వు చేసుకో అంటూ వదిలేసింది. గతంలో అమెరికా నుండి ఇలాంటి వాళ్ళు ఎవరైనా భయపెడితే భయపడిపోయేవి మన గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం మాత్రం ఇలాంటి వాళ్లకు మొండిగా సమాధానం ఇస్తుంది. భారత్ పై మాటల దాడి తోనో, ఎమోషనల్ గేమ్ నడిపితేనో కుదరదు అని ఎలన్ మస్క్ కి అర్థమైంది.
బీబీసీ వాళ్ళు గుజరాత్ మీద చేసిన డాక్యుమెంటరీ తీసేయమని చెప్పి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటికీ కూడా ఆదేశాలు పంపించింది మోడీ సర్కార్. బీబీసీకి సంబంధించిన ఈ డాక్యుమెంటరీని తీసేసింది. భారత్ అలా చెప్పగానే మీరు ఇలా తీసేస్తారా అని కొంతమంది భారతదేశ ద్వేషులు లాంటి వాళ్లు ఎలన్ మస్క్ ని అడిగారు.
దానికి ఎలన్ మస్క్ మాకు ఇక్కడ రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి అరెస్టు అయ్యి జైళ్ల లోకి వెళ్లడం, లేదంటే ఆ దేశ చట్టాలను బట్టి నడవడం. భారతదేశంలో పనిచేస్తున్న వాళ్లు అక్కడ ఉన్న చట్టాలను బట్టి నడవాల్సిందే కదా. అట్లా నడవకుండా ఎట్లా ఉంటాం. మేము మా వాళ్ళని తీసుకెళ్లి జైళ్ళలో పెట్టుకోమంటారా అని అడిగారట. దాంతో ఎలన్ మస్క్ ని కూడా దారికి తెచ్చిన దేశంగా భారతదేశం కనిపిస్తుంది.