ఏ దేశానికి అయినా అధికార పక్షం ఎంత ఇంపార్టెంటో ప్రతిపక్షం కూడా అంతే ఇంపార్టెంట్. ఇంకా చెప్పాలంటే బలమైన ప్రతిపక్షం ఉంటే అధికార పక్షం కూడా సరిగ్గా పనిచేస్తుంది అని అంటారు. కానీ ఇక్కడ కేంద్రంలో అధికారపక్షం మోడీతో ఒక వెలుగు వెలుగుతుంది. కానీ ప్రతిపక్షంలో మాత్రం ఆ బలం లేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తాను వస్తే అవి చేస్తాను, ఇవి చేస్తాను అని కొన్ని విషయాల గురించి చెప్తుంది.


కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలోకి వస్తే ఏమైతే చేస్తానంటుందో ఆ పాయింట్స్ అన్ని ఇప్పుడు విమర్శలకు కారణం అవుతున్నాయి. మొదటిగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డిజిటల్ పేమెంట్స్ లను రద్దు చేస్తారని తెలుస్తుంది. అంతే కాకుండా కొత్త కరెన్సీ లను రద్దుచేసి వాటి ప్లేస్ లో తిరిగి పాత కరెన్సీ తీసుకొస్తారట. మరి దీని కోసమేనా మోడీ గతంలో అంత కష్టపడింది అని కొంతమంది అడుగుతున్నారు.  


అలాగే జీఎస్టీ ని రద్దు చేస్తామని చెప్తున్నారట కాంగ్రెస్ పార్టీ వాళ్లు. అంతేకాకుండా తాము వస్తే ట్రిపుల్ తలాక్ బిల్లుని రద్దు చేస్తామని అంటున్నారట. ఇది మైనార్టీ వర్గాలను ఇబ్బంది పెట్టేటువంటి విషయం అని అంటున్నారు. అలాగే నూతన పార్లమెంట్ భవనాన్ని వాడనని చెప్పిందట కాంగ్రెస్. ఈ నిర్ణయం వెనకాల కాంగ్రెస్ ఆలోచన ఏమిటో అర్థం అవడం లేదు జనాలకి. అంతే కాకుండా కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దును పునరుద్ధరిస్తారట.


అంటే కాశ్మీర్ ని తిరిగి పాకిస్తాన్ చేతిలో పెట్టడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు ఆలోచన అంటున్నారు జనం. అలాగే వందే భారత్ రైళ్లను రద్దు చేస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంతే కాకుండా పిఎఫ్ఐ మీద బ్యాన్ ఎత్తేస్తారట. దాంతో హిందువుల మీద మతకలహాలు చెలరేగిపోయినా వీళ్ళకి పర్వాలేదనమాట అని కొంతమంది ఆశ్చర్యపడుతున్నారు. మొత్తానికి కాంగ్రెస్ నిర్ణయాలను వింటుంటే జనాలు  కంగారు పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: