ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలి గ్రామంలో అమరజీవి జలధార వాటర్ గ్రిడ్ పథకానికి శంకుస్థాపన చేసి మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. తాను పాల్గొనే సభలకు ప్రధాని మోదీ రావడానికి కొందరు భయపడుతున్నారని పరోక్షంగా విమర్శించారు. అభిమానులు వేదిక మీదకు నెట్టుకు రావడం తనకు ఇష్టం లేదని చెప్పారు. పిల్లలకు కులాలు ఆపాదించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసమే మూడు పార్టీలు కలిసి పని చేస్తున్నామని తెలిపారు.

రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లు నష్టపోయామని గుర్తుచేశారు. మళ్లీ రాష్ట్రం నష్టపోకుండా కూటమి ఏర్పడిందని వివరించారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో 3050 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ పథకానికి శంకుస్థాపన చేశామని ప్రకటించారు. జలజీవన్ మిషన్ వాటర్ గ్రిడ్‌కు అమరజీవి జలధార అని పేరు పెట్టామని చెప్పారు.అమరజీవి జలధార పథకం ద్వారా ఐదు జిల్లాల్లోని 23 నియోజకవర్గాలు 66 మండలాల్లో 67.82 లక్షల మందికి ఇంటింటికీ సురక్షిత తాగునీటి సరఫరా చేస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును నెల్లూరు జిల్లాకు మాత్రమే పరిమితం చేశారని విమర్శించారు. ఒక జిల్లాకు పేరు పెట్టి ఆయన స్థాయిని తగ్గించారని ఆరోపించారు. పొట్టి శ్రీరాములు పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని జలధార పథకానికి ఆ పేరు పెట్టామని వివరించారు. గోదావరి జిల్లాల్లో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు తాగునీటి కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారని చెప్పారు. ఈ పథకం ద్వారా 1.21 కోట్ల మందికి 35 ఏళ్ల పాటు తాగునీటి భరోసా కల్పిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రతిపక్షం నుంచి బెదిరింపులు వస్తున్నా సహించబోమని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

 9490520108..  వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్యలు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్రజ‌ల స‌మ‌స్యలు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్యక్తిగ‌త స‌మ‌స్యలు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: