దుబాయ్ నుండి భారతదేశానికి ప్రయాణించే ప్రయాణీకులు ఎవరైనా నిర్ణీత పరిమితికి మించి బంగారు ఆభరణాలను కలిగి ఉంటే వారు కస్టమ్స్ డ్యూటీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దుబాయ్ నుండి భారతదేశానికి ఎంత బంగారం తీసుకురాగలరు అంటే ? 6 నెలలకు పైగా విదేశాలలో నివసిస్తున్న భారతీయ పౌరులందరూ దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు వారి బ్యాగ్ లో 1 కిలోల బరువున్న బంగారు నాణేలు లేదా బార్లను తీసుకెళ్లవచ్చు. అయితే దుబాయ్ నుండి భారతదేశానికి పరిమితిని మించిన బంగారం తీసుకువెళ్లడానికి కస్టమ్స్ డ్యూటీ పన్నును చెల్లించాల్సి ఉంటుంది.
కస్టమ్స్ పన్ను
దుబాయ్ నుండి భారతదేశానికి అదనపు బంగారాన్ని తీసుకెళ్లడానికి కస్టమ్స్ పన్ను బంగారు కడ్డీలు అయితే రూ.10 గ్రాములకు 300 + ఎడ్యూ సెస్లో 3% బంగారం ఇతర రూపాల్లో అంటే నాణేలు, ఆభరణాలు ఉంటే రూ.10 గ్రాములకు 750 + 3% ఎడ్యు సెస్ ఉంటుంది. 6 నెలల వరకు దుబాయ్లో నివసించకుండా దుబాయ్ నుండి భారతదేశానికి పేర్కొన్న పరిమితుల్లో బంగారాన్ని తీసుకువస్తే 36.05% అదనపు కస్టమ్స్ డ్యూటీని చెల్లించాల్సి ఉంటుంది.
1 కిలోల కంటే ఎక్కువ బరువున్న బార్లు, నాణేలను తీసుకువెళ్లడానికి కస్టమ్స్ డ్యూటీ ఛార్జ్ 36.05%. యుఎఇ రాయబార కార్యాలయం ప్రకారం, యుఎఇ నుండి భారతదేశానికి ప్రయాణించే వ్యక్తి 10 కిలోల కంటే ఎక్కువ బంగారాన్ని, ఆభరణాలను కూడా తీసుకెళ్లలేరు. ఖచ్చితంగా పరిమితి ఉన్నంత వరకే బంగారాన్ని దుబాయ్ నుంచి తీసుకురావాలి.