ప్రస్తుత కాలంలో కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, అలసట, నీరసం, రక్తహీనత, శరీరంలో క్యాల్షియం లోపం ఇంకా ఐరన్ లోపం ఇలా చాలా రకాల అనారోగ్య సమస్యలతో బాధపడే వారి సంఖ్య బాగా పెరుగుతుంది. ఇందుకు మారిన మన ఆహారపు అలవాట్లే ఈ సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం. ఈ సమస్యలన్నింటిని బయటపడడానికి చాలా రకాల మందులను వాడుతూ ఉంటారు. అయితే మందులను వాడే పని లేకుండా కేవలం మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఓ పొడిని తయారు చేసుకుని వాడడం వల్ల ఈ సమస్యలన్నింటిని మనం చాలా ఈజీగా దూరం చేసుకోవచ్చు.ఈ పొడిని వాడడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే ఈ టిప్ ని ఎలా తయారు చేసుకోవాలి..అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి  మనం గసగసాలను, నల్ల నువ్వులను ఇంకా బాదం పప్పును ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక జార్ లో 4 టీ స్పూన్ల నల్ల నువ్వులను తీసుకోని ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ గసగసాలను, 15 బాదం గింజలను వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని స్టోర్ చేసుకోవాలి. ఈ పొడిని 15 రోజుల కంటే ఎక్కువగా స్టోర్ చేసుకోకూడదు.


తరువాత ఇలా తయారు చేసుకున్న పొడిని పాలల్లో కలిపి తీసుకోవాలి. ఒక గిన్నెలో ఒక గ్లాస్ పాలను పోసి ఆ తరువాత ఇందులో ముందుగా తయారు చేసుకున్న పొడిని 2 టీ స్పూన్ల మోతాదులో వేసుకోవాలి. వీటిని పిల్లలకు ఒక టీ స్పూన్ మోతాదులో కలిపి ఇవ్వాలి. తరువాత ఈ పాలను పొంగు వచ్చే దాకా మరిగించి స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి.ఆ తరువాత ఈ పాలను ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇందులో రుచి కోసం బెల్లం లేదా పటిక బెల్లం పొడిని కలిపి తీసుకోవాలి. డయాబెటిస్ సమస్యతో బాధపడే వారు అయితే పటిక బెల్లాన్ని వాడకపోవడమే వారి ఆరోగ్యానికి మంచిది. ఇలా తయారు చేసుకున్న పాలను ప్రతి రోజూ రాత్రి పడుకోవడానికి అర గంట ముందు తాగాలి. ఇలా తాగడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ కూడా లభిస్తాయి. అలాగే మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. నీరసం, అలసట నుండి కూడా చాలా సులభంగా బయటపడవచ్చు. ఇంకా అలాగే ఈ పాలను తీసుకోవడం వల్ల పోషకాహార లోపం తలెత్తకుండా ఉంటుంది. రక్తహీనత సమస్యతో బాధపడే వారు ఈ పొడిని తయారు చేసుకుని వాడడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితాన్ని పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: