ప్రస్తుతం షుగర్ వ్యాధి ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. చిన్న పిల్లలకు కూడా షుగర్ వ్యాధి వస్తుంది అంటే నమ్మండి. మారిన జీవన విధానాలు ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఈ కారణంగా  హెల్త్ పాలసీ తీసుకోవడం చాల మంచింది. దీంతో జేబుకు చిల్లు పడకుండా ముందు జాగ్రత్త కూడా పడవచ్చు. ఇక ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ గణాంకాల ప్రకారం.. షుగర్ లేదా షుగర్ సంబంధిత ఇతర కారణాల వల్ల ప్రతి ఏడు సెకన్లకు ఒకరు మరణించడం జరుగుతుంది అని తెలుపుతున్నారు.


ఇలా మరణిస్తున్న వారిలో 60 ఏళ్లలోపు మందే 50 శాతం ఉండటం చాలా గమనార్హం. భారత్‌లో 2017 నాటికే 7.2 కోట్ల మంది షుగర్ వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారు. 2040 నాటికి ఈ సంఖ్య 12.3 కోట్లకు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అని నిపుణులు తెలుపుతున్నారు.


ఇక లేడీ హడ్రింజ్ మెడికల్ కాలేజ్ సర్వే ప్రకారం.. 33 శాతం మంది డయాబెటిక్ పేషంట్లు కుటుంబ ఆదాయంలో 5 శాతాన్ని డయాబెటిక్ కేర్ కోసం ఖర్చుపెడుతున్నారు అని తేలింది. ఇటీవల కాలంలో డయాబెటిక్ కేర్ ఖర్చులు  భారీగానే పెరిగాయి. దీంతో కుటుంబాలపై భారం బాగా పెరిగిపోతుంది. షుగర్ వ్యాధికి దీర్ఘకాల ట్రీట్‌మెంట్ చాల అవసరం. దీంతో ఖర్చులు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. 


డయాబెటిక్‌ వ్యాధిని ఎదుర్కొనేందుకు సమగ్రమైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం చాల ఉత్తమం. దీంతో మీకు డబ్బులు ఆదా చేసుకోవడంతోపాటు  నచ్చిన హాస్పిటల్‌లో వైద్య సేవలు కూడా పొందవచ్చు. ఇక ఒక వేళా నాన్ నెట్‌వర్క్ హాస్పిటల్‌లో వైద్యం చేయించుకున్న కూడా మీ డబ్బులు మీరు వెనక్కు పొందే అవకాశం కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఇన్‌స్టంట్ డయాబెటిక్ కవరేజ్ పాలసీలు కూడా ఉండడం గమనార్థకం. మీకు షుగర్ వ్యాధి ఉన్నా కూడా పాలసీ తీసుకొని మంచి అవకాశాలు పొందవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: