ప్రస్తుతం వేసవి కాలం కాబట్టి ఊరికినే ఒంటి లో ఉన్న శక్తి మొత్తం కోల్పోయే పరిస్థితి వాతావరణం చుట్టుపక్కల ఉంది. ఇటువంటి సమయంలో ఎప్పటికప్పుడు శక్తిని పొందడానికి అరటిపండు తినటం చాలా మంచిదని వైద్యులు అంటున్నారు. అందువల్లే చాలా వరకు క్రికెట్ మ్యాచుల్లో ప్లేయర్స్ కి అరటి పళ్ళు త్వరగా జీర్ణమవుతాయి శక్తినిస్తాయని అందిస్తుంటారు.  ప్రజెంట్ బయట మార్కెట్లో కూడా అరటి పళ్ళు కుప్పలుతెప్పలుగా దొరుకుతున్నాయి.

 

వేసవి కాలం కావడంతో పూర్తిగా పండిన అరటి పండ్లు దొరికే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు. దీంతో బాగా పండిన అరటి పండ్లను చాలా మంది కొన్ని లాగిస్తున్నారు. వాస్తవానికి తీసుకుంటే పూర్తిగా పండిన అరటి పండ్లు తినటం వల్ల బలం బాగా చేకూరుతుందని అటువంటి అరటిపండ్లలో అనే మంచి పోషకాలు ఎక్కువగా లభిస్తాయి అని వైద్యులు చెబుతున్నారు. పూర్తిగా పండిన అరటి పండు వల్ల ఇతర ప్రయోజనాలు కూడా మనకు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

 

 

  1. బాగా పండిన అర‌టి పండ్లు మ‌న‌కు చాలా తేలిగ్గా జీర్ణ‌మ‌వుతాయి. దీంతో పోష‌కాలు కూడా మ‌న‌కు ఎక్కువే లభిస్తాయి.

 

  1. బాగా పండిన అర‌టి పండ్ల‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి మ‌న శరీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి.

 

  1. అర‌టి పండ్ల‌ను బాగా పండి ఉన్న‌ప్పుడు తింటేనే రుచిగా ఉంటాయి. వాటిల్లో పొటాషియం ఎక్కువ‌గా ల‌భిస్తుంది.

 

  1. చిన్నారుల‌కు సైతం బాగా పండిన అర‌టి పండ్ల‌ను తినిపిస్తేనే ప్ర‌యోజ‌నం ఉంటుంది. వారు వాటిని తేలిగ్గా జీర్ణం చేసుకోగ‌లుగుతారు.

 

  1. బాగా పండిన అర‌టి పండ్ల‌లో ప్ర‌క్టోజ్ ఎక్కువ‌గా ఉంటుంది, క‌నుక అది మ‌న శ‌రీరంలో గ్లూకోజ్ గా మారి శ‌క్తి అందుతుంది. అయితే డ‌యాబెటిస్ ఉన్న‌వారు బాగా పండ‌ని అర‌టి పండ్ల‌ను తింటేనే మంచిది. వాటిలో తీపి త‌క్కువ‌గా ఉంటుంది. దీనికి తోడు వాటిని తినగానే ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెర‌గ‌కుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: