రామయ్య ఇంట్లో ఒకకోడి పుంజు, రంగయ్య ఇంట్లో ఒక కోడిపుంజు ఒక కోడి పెట్ట కోసం పోట్లాడుకొని ఒకదానిపై ఒకటి తలపడ్డాయి. ఓడిపోయిన పుంజు పారిపోయి పొదల్లో దాక్కొంది.
గెలిచిన కోడి పుంజు గెలిచిన గర్వంతో ఒక పూరిల్లు ఎక్కి బిగ్గరగా కొక్కరోకో అని బిగ్గరగా అరవసాగింది. ఆకాశంలో ఎగురుతున్న ఓ రాబందు ఆ శబ్దం విని కిందకు దిగి కోడిపుంజును కాళ్ళతో పట్టుకొని ఎగరవేసుకుపోయింది.
అప్పుడు పొదలో దాగి ఉన్న కోడిపుంజు కోడిపెట్టతో హాయిగా సహజీవనం సాగించింది. కథ లోని నీతి : దేవుడు గర్వపోతులనే శిక్షిస్తాడు.
మరింత సమాచారం తెలుసుకోండి: