కొన్ని రకాల ఆహారాలను డయాబెటిక్ పేషెంట్లు తమ డైట్‌లో కనుక చేర్చుకున్నట్లయితే రక్తంలోని చక్కెర స్థాయి నియంత్రణలో ఉండడంతో పాటు చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. మరి ఆరోగ్య నిపుణులు సూచిస్తున్న ఆ ఆహారాలేమిటో ఇప్పుడు చూద్దాం..ఇక అన్ని రకాల ఆకుకూరలు, వంకాయ, బెండకాయ, ఉల్లి పాయలు, అరటి పువ్వు, బ్రాసెల్స్‌ మొలకలు, క్యాబేజి, కాలిఫ్లవర్‌ ,పుదీన, బొప్పాయి, కరివే పాకు, బ్రకోలి, దోసకాయ, టర్కిప్‌, ముల్లంగి, బెంగుళూరు వంకాయ, అరటిపువ్వు, ములగకాయ, గోరు చిక్కుడు, కొత్తిమీర, పొట్లకాయ, టమాట , బ్రాడ్‌బీన్స్‌, తెల్ల గుమ్మడి ఇంకా అలాగే సొరకాయ వంటివి చాలా ఎక్కువగా తీసుకోవాలి.ఎందుకంటే వీటిలో ఉండే పలు రకాల పోషకాలు డయాబెటిక్ పేషెంట్ల ఆరోగ్యాన్ని కాపాడడమే కాక వారి రక్తంలో చక్కెర స్థాయిని కూడా ఈజీగా నియంత్రణలో ఉంచుతాయి.ఇక షుగర్ పేషెంట్ల డైట్‌లో ఖచ్చితంగా పప్పు దినుసులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పప్పు దినుసుల నుంచి లభించే ప్రోటీనులు ఇంకా మాంసాహారం నుంచి లభించే ప్రోటీనుల కంటే చాలా మేలైనవి. ఇంకా పప్పు దినుసులు ప్రోటీన్, ఫైబర్ చాలా ఎక్కువగా కలిగి ఉంటాయి.


ఈ మూలకాలనేవి రక్తంలోని చక్కర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటాయి.అలాగే డయాబెటిక్‌తో ఎక్కువగా బాధపడుతున్నవారికి చేపలు చాలా మంచి ఆహారం. హెర్రింగ్, సార్డైన్, సాల్మన్, అల్బకోర్ ట్యూనా ఇంకా మాకేరాల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫాటీ ఆసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె, రక్తనాళాల ఆరోగ్యాన్ని ఇంకా దాని పనితీరును మెరుగుపరుస్తాయి.అందుకే వారంలో కనీసం 2 సార్లు అయిన చేపలను తినటానికి ప్రయత్నించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.ఇక మన శరీరంలో చెడు కొవ్వుల స్థాయిలను తగ్గించి, రక్తంలోని చెక్కర స్థాయిని సాధారణ స్థితిలో ఉంచే ఆరోగ్యవంతమైన ఫైబర్ ఓట్స్‌లో చాలా పుష్కలంగా ఉంటుంది. ప్లెయిన్ ఓట్స్ లేదా స్టీల్ కట్ ఓట్స్ అనేవి ఎక్కువ చక్కెరలను కలిగి ఉండకుండా ఇవి నెమ్మదిగా జీర్ణం అవుతాయి.అలాగే బెర్రీస్ తక్కువగా కార్బోహైడ్రేట్స్‌ను కలిగి ఉండటం వలన మధుమేహ వ్యాధి గ్రస్తులకు చాలా మంచివి.అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలో ఎలాంటి మార్పులు ఎదురవ్వవు.

మరింత సమాచారం తెలుసుకోండి: