చక్కెర, మైదా, జంక్ ఫుడ్లకు దూరంగా ఉండాలి. బదులుగా, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు (మిల్లెట్స్), నట్స్, పప్పులు వంటివి తీసుకోవడం మంచిది. భోజనాన్ని ఒకేసారి ఎక్కువ కాకుండా చిన్న చిన్న భాగాలుగా ఎక్కువసార్లు తినడం వల్ల చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. అలాగే, కిడ్నీలు సరిగ్గా పనిచేస్తాయి.
ప్రతిరోజూ 7-8 గంటల నిద్ర తప్పనిసరి. సరిపడా నిద్ర లేకపోతే కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి పెరిగి రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఇది కూడా చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.
ఈ అలవాట్లను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా షుగర్ వ్యాధిని సమర్థవంతంగా నియంత్రించవచ్చు, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. వైద్యుల సలహాలు కూడా తీసుకోవడం చాలా ముఖ్యం. షుగర్ ట్యాబ్లేట్లు వాడుతూ ఈ టిప్స్ పాటిస్తే మంచిదని చెప్పవచ్చు. దీర్ఘకాలిక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య శాశ్వతంగా దూరమయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి