దశల వారీగా నోట్లను తగ్గించి పూర్తిగా డిజిటల్ మయం చేయాలనే ప్రయత్నం కొనసాగుతోంది. అయితే డిజిటల్ పేమెంట్ల ద్వారా అక్రమ వ్యాపారాలను తగ్గించవచ్చు. ట్యాక్స్ కట్టకుండా తప్పించుకునే వారి భరతం పట్టొచ్చని అనుకున్నారు. కానీ దీని నుంచి తప్పించుకోవాలని ఎక్కువ మంది మళ్లీ క్యాష్ ను ఆశ్రయిస్తున్నారు. ఒక వ్యక్తికి నెల వారీ వచ్చే జీతం ఎంత, అదనంగా వచ్చే జీతం ఎంత అనే వివరాలతో అన్ని డిజిటల్ పేమెంట్ల ద్వారా తెలిసిపోతాయి. తద్వారా ఆ వ్యక్తి ట్యాక్స్ ఎంత కట్టాలి. ఎంత కట్టకుండా తప్పించుకున్నాడు. తదితర వివరాలను సేకరించవచ్చు. అమెరికాలో కేవలం 100 డాలర్ల నోటే అతి పెద్దది.


ఇండియాలో కూడా నోట్ల ను దశల వారీగా రద్దు చేసి ఎక్కువగా డిజిటల్ కరెన్సీ రూపంలోకి మారితే అది అతి పెద్ద విజయం సాధించనట్లు అవుతుంది. అనిల్ బోకిల్ అనే వ్యక్తి డిమానిటైజేషన్ అనే విషయం గురించి అనేక పుస్తకాలు రాశారు. అర్ధ క్రాంతి వ్యవస్థాపకుడైన అనిల్ బోకిల్ చాలా మంది ప్రధానమంత్రులను కలిసి డిమానీటైజేషన్ గురించి వివరాలు చెప్పారు. పీవీ నరసింహ రావు, వాజ్ పేయి, ఇలా అనేక మంది ప్రధానులను కలిసి నోట్ల రద్దు అంశం, భారత ఆర్థిక వ్యవస్థ పురోగమనం గురించి చెప్పారు. కానీ ఆ ప్రధానమంత్రులెవరూ పట్టించుకోలేరు.


కానీ నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక 8 నిమిషాల టైం ఇచ్చి మీ ప్రధాన అజెండా చెప్పండని అడిగారు. అనంతరం ఎనిమిది నిమిషాల మీటింగ్ కాస్త రెండు గంటలకు పైగా కొనసాగింది. మొత్తం వివరాలు రాసుకొచ్చారు. అదే ప్రస్తుతం దశల వారీగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నోట్ల రద్దు అనే ప్రతిపాదన తీసుకొచ్చింది అనిల్ బోకిల్ అనే వ్యక్తి అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. డీమానిటైజేషన్ అనేది ప్రత్యేకించి ఎలా చేయాలి. ఏ విధంగా ముందుకెళ్లాలి. వచ్చే సమస్యలు ఏమిటి.. ఎలాంటి పరిస్థితులు ఎదరవుతాయని మోదీకి ఆయన సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: