యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా గతంలో రన్ రాజా రన్ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం సాహో. బాహుబలి రెండు భాగాల సూపర్ హిట్స్ తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. ఇక ప్రస్తుతం ఎక్కడ విన్నా అందరి నోటా ఒకటే మాట అదే సాహో. 

నిజానికి ఎప్పుడో పూర్తి కావలసిన ఈ సినిమా, కొన్ని అనివార్య కారణాల వలన షూటింగ్ లేట్ అవుతూ ఇప్పటికి దాదాపుగా పూర్తి కావచ్చింది. ఇకపోతే ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి రెండు మేకింగ్ వీడియోలను విడుదల చేసిన చిత్ర యూనిట్, కాసేపటి క్రితం ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఈ టీజర్ మంచి సంతృప్తిని ఇచ్చిందనే చెప్పాలి. ఇక టీజర్ లో చూపించిన యాక్షన్ మరియు చేసింగ్ సీన్స్ చూస్తుంటే ఇది మంచి యాక్షన్ మూవీ అని అర్ధం అవుతోంది. 

ఇక హీరోయిన్ శ్రద్ధ కపూర్ ఈ సినిమాలో ఒక పోలీస్ పాత్రలో నటిస్తుందని ఇప్పటికే న్యూస్ వచ్చిన విషయం తెలిసిందే. టీజర్ లో శ్రద్ధ కూడా బాగా ఆకట్టుకుంది, గన్ పట్టుకుని ఆమె కలుస్తున్న సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఇక ముఖ్యంగా టీజర్ లో అందరిని ఆకట్టుకుంది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనే చెప్పాలి. ఈ టీజర్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని ఇచ్చింది గిబ్రాన్. ఇకపోతే ప్రభాస్ సరసన శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ విలన్ గా నటిస్తున్నాడు. యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ దాదాపుగా రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు...!!


మరింత సమాచారం తెలుసుకోండి: