చెన్నైలో పుట్టిపెరిగిన రెజీనా కసాండ్రా ఇప్పటివరకు పలు తమిళ్ మరియు తెలుగు భాషల సినిమాల్లో నటించి ప్రేక్షకుల నుండి మంచి పేరు సంపాదించారు. 2005లో కంద నాల్ ముదల్ అనే తమిళ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన రెజీనా, ఆ తరువాత తమిళ మరియు కన్నడ సినిమాల్లో నటించారు. ఇక తెలుగులో ఆమె 2012లో సుధీర్ బాబు హీరోగా వచ్చిన శివ మనసులో శృతి (ఎస్ఎమ్ఎస్) సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అప్పట్లో ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో రెజీనాకు అవకాశాలు కూడా బాగానే రావడం మొదలయ్యాయి. 

అయితే ఆ తరువాత వచ్చిన అవకాశాలు కెరీర్ పరంగా రెజీనాకు పెద్దగా సక్సెస్ ని అందించలేదు. అయితే 2014లో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన పిల్ల నువ్వు లేని జీవితం, 2015లో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలు మంచి హిట్ సాధించి, రెజీనాకు కెరీర్ పరంగా బ్రేక్ ని ఇవ్వడం జరిగింది. ఇక అప్పటినుండి ఇప్పటివరకు ఆమె నటించిన తెలుగు సినిమాలు చాలానే ఉన్నప్పటికీ, అవేవి మంచి హిట్స్ సాధించలేదు. ఇకపోతే లేటెస్ట్ గా ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఎవరు సినిమా, నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి, ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తో దూసుకువెళుతోంది. కొత్త దర్శకుడు వెంకట్ రాంజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను పివిపి సంస్థ నిర్మించగా, నటుడు అడివి శేష్ మరొక మెయిన్ క్యారెక్టర్ లో నటించారు. 

ఆద్యంతం ఆకట్టుకునే సస్పెన్స్ మరియు థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాలోని తన ఆకట్టుకునే నటనకు గాను రెజీనాకు ప్రేక్షకుల నుండి విపరీతంగా పొగడ్తలు కురుస్తుండడంతో ఆమె అమితానందం వ్యక్తం చేస్తోంది. దాదాపుగా ఎన్నో ఏళ్ల తరువాత తనకు మంచి సక్సెస్ లభించిందని, నిజానికి ఈ సినిమా కోసం తనను ఎంచుకున్నందుకు దర్శక నిర్మాతలకు అలానే, ముఖ్యంగా తన ఫ్రెండ్ అడివి శేష్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నారు రెజీనా. అంతేకాక ఈ సినిమా సూపర్ హిట్ తో రెజీనాకు అవకాశాలు కూడా అప్పుడే క్యూ కట్టాయని అని టాలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. కానీ ఆమె మాత్రం ఇకపై తాను చేసే క్యారెక్టర్స్ విషయమై ఆచి తూచి అడుగులేయాలని భావిస్తోందట. ఇంకా ఈ సినిమాలో నవీన్ చంద్ర, మురళి శర్మ, రాజారవీంద్ర, పవిత్ర లోకేష్ తదితరులు ఇతర పాత్రల్లో నటించగా, శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చడం జరిగింది......!!  


మరింత సమాచారం తెలుసుకోండి: